Monday, December 26, 2011

నా ఒక్క పాయింటు ప్రశ్నకి నీహారిక గారిచ్చిన పది పాయింట్ల రిప్లై కి నా సమాధానం.

నీహారిక గారు రమణ గారి బ్లాగ్‌లో ఒక వర్ణం/వర్గం మీద కొన్ని అభియోగాలు మోపారు.

http://yaramana.blogspot.com/2011/12/blog-post_21.html

వాటి మీద నేనడిగిన కొన్ని ప్రశ్నలకి వారి గూగుల్ ప్లస్ లో సమాధానమిచ్చారు. కానీ నా దృష్టిలో ప్లస్‌లు, ఫేస్‌బుక్‌లు స్నేహితులతో మాత్రమే పంచుకోదగ్గవి కాబట్టి నాకు ఆవిడతో ఎటువంటి పరిచయం లేదు కాబట్టి, ఆవిడ లేవనెత్తిన విషయమూ, ఆవిడ చేసిన/మోపిన అభియోగాలు పబ్లిక్ డిస్కషన్‌కి తప్ప ఆవిడ పర్సనల్ స్పేస్ అయిన ప్లస్‌లో డిస్కస్ చేసేవి కాదు కాబట్టి నా బ్లాగ్‌లో సమాధానం ఇస్తున్నాను.

1. "రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళనా అర్ధం ?"
సందర్భాన్ని బట్టి తప్పకుండానూ. కాంక్రీట్‌గా ఇదీ అననప్పుడు, ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహలల్లుకోవడనికి ఏముంది చెప్పండి. సీత ముమైత్ ఖాన్‌లా నవ్వబట్టే రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళాడు అని మీరు ఊహాలు/కథలు అల్లేశారు ఆ మధ్య. మీకు తెలియనిదా? :)

2. "పగ అన్నది ఎందుకు వాడానో తెలియాలంటే మీరు 100% లవ్ సినిమా చూడాలి. ఆ సినిమాలో ఒక రెండేళ్ళ పిల్లవాడు ముద్దుగా "రెండేళ్ళ పగక్కా" అని అంటాడు. ఆ సినిమా లో డైలాగ్స్ అవి... వాటికి ట్రూ మీనింగ్ తీసుకోనవసరం లేదు. పైన రెండు కమెంట్స్ రమణ గారికి.. మూడవది లేఖిని గారికి వ్రాసినది. నా నుండి జనాలు అటువంటి కమెంట్స్ ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కమెంట్స్ చేయవలసి వచ్చింది. "

మీరో, మరొకరో, ఇంకొకరో ఏది ఎందుకు అన్నారో తెలుసుకోవటానికి రిలీజ్ అయిన అడ్డమైన సినిమా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రూ మీనింగ్ తీసుకోకూడదు అని మీరనుకున్నప్పుడు ఒక డిస్క్లైమర్ పెట్టాలి. ప్రతీ గడ్డీ గాదం సినిమాలు చూడని నాలాంటివాళ్ళకి కాస్త తెలుస్తుంది.
ఒక వర్ణాన్ని పట్టుకుని అంత తీవ్రంగా పగ తీర్చుకుంటాను, చిన్నపిల్లలు కూడా ఇలా పగ తీర్చుకోవచ్చు అని తెలుసుకునేలా పగ తీర్చుకుంటాను అని స్టేట్మెంట్స్ ఇచ్చి చివరికి అబ్బే తూచ్ జనాలు నా నించి అటువంటివి ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కామెంట్స్ చేయవలసి వచ్చింది అని అనటం మీకు కరెక్ట్ అనిపిస్తోందా అసలు? మీ నించి అంత చీప్ కామెంట్స్ ఆశిస్తారా జనాలు? సీరియస్లీ?

"3. నా తెలివితేటలు, ధైర్యం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నా కమెంట్స్, నా బ్లాగ్ చెపుతాయి, వీలుంటే చూడవచ్చు."

మీ కమెంట్స్ గురించి పైన ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పాను. ఇక బ్లాగ్ అంటారా. I wish I could but I am sorryమీవి కొన్ని పోస్ట్శ్ చూశాక ఇంక చూడటం అనవసరం అనిపించింది. అయినా మీరు ప్రస్తుతం మాట్లాడే విధానాన్ని బట్టి మీ గురించి ఒక అభిప్రాయానికి రాగలను కానీ మీ కామెంట్స్, బ్లాగ్ ఫాలో అయి మీ గురించి తెలుసుకోవాలంటారా? ఎవరైనా ఒక పోస్ట్ వేసినా, కామెంట్ చేసినా దాని మీద నా కామెంట్ ఉంటుంది కానీ వారి గత పోస్టులు, కామెంట్స్‌ని బట్టి కాదు.

"4.నాకున్న పరిశీలన మరియు భగవద్గీత ఆధారంగా బ్రాహ్మణులకి గ్రహణశక్తి, ధారణా శక్తి, పునశ్చరణ శక్తి ఎక్కువ గా ఉన్నట్లు నేను గమనించాను. అంత మాత్రాన అందరూ అలా ఉండాలని రూలు లేదు. అమృతం అంతా దేవతలు తాగేస్తే రాక్షసులు ఏం చేసారు? వాళ్ళకున్న ఆలోచనా శక్తితో దేవతలతో రాక్షసులు వివాహం చేసుకుని చ్రొస్స్ బ్రీదింగ్ వల్ల కొందరు రాక్షసులు దేవతలు అయ్యారు. అలాగే ఈ బ్రాహ్మణులు కూడా సత్వ గుణం తోనే ఉండాలన్న రూల్ లేదు. "

"బ్రాహ్మణులు అందరూ సత్వగుణంతో ఉండాలన్న రూల్ లేదు." అసలలాంటి రూల్ ఉందని ఎవరన్నారు? ఇది కూడా మళ్ళీ మీ ఊహ? సత్వగుణమే కాదు వీరగుణం కూడా అదే పాళ్ళల్లో చూపించగలరు అవసరం వస్తే. బ్రాహ్మణులు కూడా రజస్తమో గుణాలకి అతీతులు కారు. నేను రమణ గారి బ్లాగ్‌లో చెప్పినట్టు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన, పొందే అర్హత కలిగిన కుటుంబంలో పుడితే ఆ జ్ఞానం వృద్ధిపొందే అవకాశం ఎక్కువ ఆ జ్ఞానానికి సంబంధించిన కొన్ని శక్తులు సహజంగా అలవడతాయి. పైన మీరు చెప్పారే అలాంటివి కొన్ని. ఉపయోగించుకున్నవారు బాగు పడతారు. లేదూ, షరా మామూలే. అంతే కానీ బ్రాహ్మణుడుగా పుట్టినవాడు బై డీఫాల్ట్ గొప్పవాడని ఎవరూ అనలేదు ఏ శాస్త్రమూ చెప్పలేదు.

"5.బ్రాహ్మణులు గొప్పవారని మమ్మల్ని తక్కువ గా చూస్తున్నారని ఇక్కడే ఉన్న దళితులు కొందరు వాదించటం నేను చూస్తున్నాను. నిజానికి కొందరు ముస్లింలు, కొందరు దళితులు అని చెప్పుకునే వారు ఎంతో చక్కటి తెలుగుతో చక్కగా వ్రాస్తారు. కానీ వాళ్ళంత గా వాళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళు దళితులని మనకి తెలిసింది. వాళ్ళు చెప్పకపోతే మనకి తెలిసే అవకాశమే లేదు. అటువంటప్పుడు చిన్నచూపు ఎక్కడ ??"

కదా. ఇప్పుడు ఈ మాట అంటున్నారంటే అక్కడ రమణగారి బ్లాగ్‌లో బ్రాహ్మణుల మీద మీరు చేసిన వ్యాఖ్యని మీరే ఖండించుకున్నట్టు కదా?

"6.ఎదుటి మనిషి శత్రువైనా వాళ్ళ గొప్పతనం ఒప్పుకోవడం క్షత్రియ ధర్మం , మేము క్షత్రియులమైనప్పుడు ముందు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాతనే బ్రాహ్మణ ధర్మానికి వెళ్ళగలుగుతాను కానీ ముందుగా వెళ్ళలేను. అందుకే మా ఆయనని కూడా ధ్యానం వద్దు రాజకీయం ముద్దు అని పోరుతున్నాను. "

మీరు చెప్పినది క్షత్రియధర్మం కాదండి. అది సనాతన ధర్మం. ఏ వర్ణానికి చెందినవాడైనా పాటించవలసిన ధర్మం. మీరు ప్రత్యేకంగా బ్రాహ్మణధర్మానికి వెళ్ళనక్కరలేదు. మీ క్షత్రియ ధర్మం సరిగ్గా నిర్వహిస్తే చాలు. ప్రజలని పాలించే అవకాశం ఉంటుందని రాజకీయాల్లోకి వెళ్ళటమే క్షత్రియ ధర్మం అని మీ ఉద్దేశమా? రాముడు రాజుగా లేకుండానే చాలా రాజధర్మాలు నిర్వహించాడు. రాముడితో పోలుస్తున్నాననుకుంటున్నారేమో. ఆ తప్పు నేనెప్పటికీ చెయ్యను. ఉదాహరణ చెప్తున్నానంతే. బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన బై డీఫాల్ట్ బ్రహ్మజ్ఞాని ఎలా అవరో క్షత్రియుడిగా పుట్టినంత మాత్రాన ఎవరూ రాజవరు. అవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ధర్మం నెరవేర్చాలంటే మీ చుట్టూ ఉన్నవారికి నాయకురాలవటానికి ప్రయత్నించండి. కష్మీర్లు, అయోధ్యలూ తర్వాత.

"7.నేను చెప్పింది నా ఫిలాసఫీ మాత్రమే !! సైన్స్ కాదు. సైన్స్ అయితే అందరూ ఆమోదించవలసి ఉంటుంది. ఇక్కడ నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించనవసరం లేదు."

ఏకీభవించటం చాలా పై మాట. ముందు ఏకెయ్యకుండా ఉండే అభిప్రాయాలు వెలిబుచ్చండి. మీ అభిప్రాయం ఏదైనా మీరు ఒక పబ్లిక్ ప్లేస్‌లో బ్లాగ్ అవచ్చు మరోటి అవ్వచ్చు ఒక వ్యక్తిని కాక ఒక సమూహాన్ని ఒక వర్గాన్ని అనేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. రాజు/నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. మాట తూలకపోవటం.

"8.ఇస్లాం ఎడారుల్లో పుట్టింది అక్కడ ధాన్యం దొరకదు కాబట్టి జీవహింస చేయవచ్చు అన్నారు. బౌద్ధం పుట్టినచోట ధాన్యం దొరుకుతుంది కాబట్టి జీవహింస చేయరాదు అన్నారు. ఒక బ్రాహ్మణుడిని ఎడారిలోకి తీసుకెళ్ళిపోయామనుకోండి అక్కడ ఏమీ దొరక్క పోతే ఏం తింటాడు ? నేను బ్రాహ్మణుడిని కాబట్టి మాంసం తినను అంటాడా ? పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. "

నిజంగా? పరిస్థితులని బట్టి సర్దుకుపోవాలా? శత్రువు కాలిని నాకితే ప్రాణభిక్ష పెడతాను అని పట్టుబడ్డ రాజుతో అంటే ఆ రాజేం చేస్తాడండి? శత్రువు కాళ్ళు నాకుతాడా? అదా "క్షత్రియ ధర్మం" ? నాకు తెలిసి ప్రాణం పోయినా దేశ మర్యాదనీ, పౌరుషాన్ని వదులుకోడు. క్షత్రియుల్లో కూడా రకాలున్నారా? బతికి బట్ట కడితే తర్వాత "పగ" తీర్చుకోవచ్చు అనుకుని ప్రాణం కోసం శత్రువు కాళ్ళు నాకేవాడు నా దృష్టిలో క్షత్రియుడు కాదు, నాయకుడు కాదు. కేవలం నక్కజిత్తుల వాడు. అలానే బతకటం కోసం మాత్రం ఇష్టం లేకపోయినా మాంసం తింటాను అనేవాడు బ్రాహ్మణుడు కాలేడు. బతికేది బ్రహ్మజ్ఞానం కోసమనీ, ఆ బతుకు బతకటానికి తింటాం తప్ప తినటానికి బ్రతకటం లేదని తెలియని వాడు బ్రాహ్మణుడే కాదు మనిషే కాదు.

"9.ఎడారుల్లో యుద్ధాలు ఎక్కువ , మగవారు ఎక్కువ సంఖ్యలో మరణిస్తారు కాబట్టి... ఒక మగవాడు ఎందరు స్త్రీలనైనా వివాహమాడవచ్చు అని ఇస్లాం లో చెప్పారు. ఒక స్త్రీ ఒకరినే వివాహమాడాలని హిందూ మతం చెపుతుంది. ఇపుడు ఒక స్త్రీ కి ఎన్ని సార్లు అయినా ప్రేమ పుట్టవచ్చు, స్నేహం కాదు ప్రేమ కాదు, మరోకటేదో ఉందని ముందు చెప్పిన సిద్ధాంతం కాదన్నారనుకోండి వళ్ళు మండుతుంది. అపుడు మత ఘర్షణలు జరుగుతాయి. బలం, బలగం ఉన్నాయనుకోండి మసీదు కూల్చేస్తారు, మా మతమే గొప్ప అని అంటారు. రాముడు చేయనిది రాముడి పేరు మీద వీళ్ళు చేస్తారు. ఎవరు నష్టపోయేది ? "

మీ లాజిక్కులు చాలా బావున్నాయి, నవ్వుకోటానికి. :) హిందూ మతం గురించి ముందు మీరు కాస్త తెలుసుకోవాలి. హిందూ మతం ఎప్పుడూ ఇలా చెయ్యాలి అలానే చెయ్యాలి అని చెప్పదండి. ఏది ఎలా ఎందుకు చేస్తే మంచిదో చెప్తుంది. అంతే. హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఆ రకంగా చేస్తారు అంతే. అలానే ఒకరినే వివాహమాడాలన్న విషయం కూడా. ఎందుకంటే అలా ఒకరికి ఒక్కరే అయినప్పుడు కుటుంబం స్థిరంగా ఉంటుంది. కుటుంబ స్థిరత్వం సమాజ స్థిరత్వానికి, శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైనప్పుడు దేశం ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా?
అయినా స్త్రీ ఒకరినే వివాహమాడాలని. లేదంటే వళ్ళు మండి మతఘర్షణలు జరుగుతాయని ఏ రకంగా లింకు పెట్టారు మీరు. శోభాడే నాకు తెలిసి ముగ్గురిని పెళ్ళి చేసుకుంది. ఎన్ని మతఘర్షణలు జరిగాయండి? ఏవైనా రెండు విషయాలు ముడిపెడుతున్నప్పుడు ఆ రెంటికీ కాస్త సామ్యం ఉండాలని మీకనిపించటం లేదు?

"10.మార్పు ఎపుడు మొదలైనా కొత్త ఆలోచనలను హేళన చేయటం, హింసాత్మకంగా ఎదురు తిరగడం, తర్కరహితంగా ప్రశ్నించడం, చివరగా తప్పదు కాబట్టి అంగీకరించడం జరుగుతాయి. కులం, గుణం, మతం ప్రాతిపదికగా కాకుండా మనిషి ఎంత కష్టపడితే అంత సుఖాన్ని కోరుకోవాలి, ఒకరి స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదు. సమసమాజం అంటే పైనున్న వాళ్ళని క్రిందికి లాగడం కాదు, క్రింద నున్న వారిలో productivity ని పెంచడం."

ఇదసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్‌కి ఏమాత్రం సంబంధించనిది. కానీ బానే చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ మీ సొంత స్టేట్మెంట్స్ కావు కదా? సమసమాజం స్టేట్మెంట్ తక్క? ఇంతకీ కిందవారిలో productivity పెంచితే సమసమాజం వచ్చేస్తుందా? productivityతక్కువయి కిందన ఉన్నారంటారా? ఒకవేళ కొంతమందికి ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రానట్టు కొంతమందికి ఎంత నేర్పినా పని రాదు, వాళ్ళ productivity పెరగదు. మరి అప్పుడు? సమసమాజం అనగా పైనా కిందా తారతమ్యం లేకుండా not based on the productivity ప్రతి ఒక్కరు సమాజంలో సమమైన స్థానాన్ని పొందటం.

ఇకనించి జనాలు మీ నించి ఎటువంటి కమెంట్స్ ఆశిస్తారు అని కాకుండా కాస్త జ్ఞానవంతమైన వ్యాఖ్యలు చెయ్యగలరని ఆశిస్తున్నాను. మనిషిగా పుట్టినందుకు (ఏ వర్ణమైనా) జ్ఞానసముపార్జన ముఖ్యం కదండి మరి. :)

ఇంతకీ మీరు రమణగారి బ్లాగ్‌లో కమెంట్స్ ఎందుకు తీసేశారు నీహారిక గారూ?

62 comments:

Anonymous said...

బాగా సమాధానం ఇచ్చారండి, కాని ఏం ప్రయోజనం?! ఇలాంటి సంధర్భంలో భర్తృహరి ఏమన్నాడంటే "... మనసు రంజింప రాధు". కొన్నిటిని అలా స్వాభావికంగా వదిలేస్తేనే ప్రకృతిని పరిరక్షించిన వారమవుతాము. ఏమంటారు? ;)

Anonymous said...

LOL

phani

పద్మ said...

శంకూ. శాన్నాళ్ళకి. మంచిగున్నరా? :)

హన్నా, హెంత మాటన్నారు? నేను రంజింప చేయటానికా ఇంత చెప్పింది? అలా అర్థం అయిందా? కెవ్వ్. :(((((

Anonymous said...

మస్తుగున్నానమ్మాయ్. :) అంతా కులాసాయే కదా.

పద్మ said...

నేన్ భీ మస్త్. :)

శ్రీనివాస్ పప్పు said...

మీకు బాగా తీరిక ఎక్కువయినట్టు తెలుస్తోంది (ఆమెన్)

పద్మ said...

అవునండి కుంచెం బానే తీరిక ఎక్కువయింది. ఇప్పుడు సెలవల సీజన్ కదా. :)))

sree said...

aaha, adbhutam, nijanga baaga chepparu, neeharika garu mee comments chadivi vimarsalu ela rayalo telusukuntarani naa aasa.

naa tarapuna oka point. oka brahmin ni edari lo vadileste, mamsam tintada tinada anedi atani sva nirnayam. nenu daanni tappu ani kani, correct ani kani anavasara prasangam cheyyanu.

Anonymous said...

అదొకపిచ్చిది

దాన్నిపట్టుకుని ఏమిచెప్పినా వృధా.పిచ్చివాళ్లవాగుడుకు సమాధానమిచ్చేవాళ్ళుంటే పిచ్చి ఎక్కువవుతుంది గాని తగ్గదు. ఇంతశ్రమ అవసరంలేదు. ఎవరన్నా కావాలని మాట్ళాడేవాళ్లుంటే వాల్లదగ్గర మీవాదనాపటిమను ఉపయోగించవచ్చు. ఇప్పుడు వృధా

Anonymous said...

edari lo vadileste, mamsam tintada

ఎడారిలో మాంసం దొరకదు, ఇసుక వుంటుంది. అదే తిని బ్రతుకుతారు అని చెప్పలేదు, అందుకు సంతోషించండి.

Anonymous said...

*మీకు బాగా తీరిక ఎక్కువయినట్టు తెలుస్తోంది (ఆమెన్)*

సేటైర్ శ్రీనివాస్ గారు మీలా బజ్జుల్లో చేరి సొల్లు కబుర్లు చేప్పుకునేదానికన్నా, పద్మగారు మంచి పని చేశారు.

astrojoyd said...

she may have 'BIPOLAR" DISORDER..

Anonymous said...

నీహారిక గారు
మీరు మళ్ళీ మీ బ్లాగులని కూడలిలో కలుపుకుని వీళ్ళకి దీటైన సమాధానం చెప్పాలి. బ్లాగుల్లో మీకున్న శత్రువులు ఎక్కువవడం ప్రస్తుతం మీ వాదన వినిపించుకునే అవకాశం లేకపోవడంతో నాణానికి ఒకవైపే కనిపిస్తోంది.

పద్మ said...

@శ్రీ గారూ,

కువిమర్శ కానంతవరకూ విమర్శ ఎప్పుడూ ఆహ్వానించదగ్గదేనండి, ఎవరు చేసినా.

ఇక బ్రాహ్మణుడు ఎడారిలో మాంసం తినటం అన్నది ఆవిడ ఉదాహరణగా ఇచ్చి ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరెలా ఉంటే ఎవరికెందుకు? ఆవిడ ఉదాహరణ వ్యక్తిగతంగా ఉంటే ఎలా ఉండేదో. కానీ ఆవిడ ఒక వ్యవస్థనే వేలెత్తి చూపించింది. అది చాలా తప్పు.

పద్మ said...

@శ్రీ గారి తర్వాతి అజ్ఞాత గారూ,

ఆవిడకి పిచ్చా వెఱ్ఱా అన్నది ఆవిడకి, ఆవిడ సన్నిహితులకి తెలియాలండి. నాకు తెలీదు.
ఇక వాదనా పటిమ విషయానికి వస్తే, వాదనా పటిమ ఉన్నదన్నందుకు సంతోషం. ఇక అవసరమా, అనవసరమా అని ఆలోచించి మాట్లాడటం అన్ని విషయాల్లో కుదరదండి. ఇష్టం వచ్చినట్టు వాగేవాళ్ళకి వీలయినంత అడ్డుకట్ట వెయ్యాలి. పిచ్చికుక్కని ఊరమ్మట వదిలేస్తారా? ఎవర్నీ కరవకుండా కాస్త కట్టుదిట్టాలు చేస్తారు కదా. ఏ విషయమైనా అంతే.

పద్మ said...

@శ్రీ గారి తర్వాతి రెండో అజ్ఞాత గారూ,

ఎడారిలో మాంసమా, ఇసకా అన్నది కాదులెండి పాయింటు. ఇక ఇసక తిని బతకటం అంటారా, ఎట్టాగొట్టా బతికితే చాలు అనుకునేవాడు ఇసకేం ఖర్మ ఏదైనా తింటాడులెండి. అలా కాక పరిస్థితికి ఎదురొడ్డేవాడు కాస్త వేరుగా ఆలోచిస్తాడు.

పద్మ said...

@శ్రీ గారి తర్వాతి మూడో అజ్ఞాత గారూ,

పప్పు గారు బురదలో కాలెందుకు పెట్టటం అని కాస్త సున్నితంగా మందలించార్లెండి. ఇంతకీ ఈ అజ్ఞాతప్రేమ ఎందుకండి పప్పు గారి మీద? కనీసం మీ పేరు చెప్పినా పప్పు గారి మీద ప్రేమకి కారణం తెలిసేది కదా?

పద్మ said...

astrojoyd గారూ, Thanks for the visit.

పద్మ said...

astrojoyd గారి తర్వాతి అజ్ఞాత గారూ,

ఆవిడ వాదన ఆవిడ వినిపిస్తూనే ఉంది కదండి అక్కడా ఇక్కడా? లేకపోతే ఇన్ని ప్రతివాదనలు ఉండవు కదా?
ఆవిడ బ్లాగులో రాసినా, ఇంకెక్కడన్నా వేసినా ఆవిడ రాతలకి తగ్గ సమాధానాలు వస్తూనే ఉంటాయి. ఆవిడ వాదన ఓటి కుండ వాదనండి. నాణేనికి రెండో వైపు కాదు కదా ఏవైపూ నిలబడలేదు.

Bhãskar Rãmarãju said...

astrojoyd గారి తర్వాతి అజ్ఞాతకి తర్వాతి పద్మ గారికి రత్వాతి పద్మగారికి తర్వాతి పద్మగారూ-
కుమ్మేశారు

Bhardwaj Velamakanni said...

Wow .. I missed all this!

పద్మ said...

అజ్ఞాత గారూ, మీ మాట మన్నించి మీ వ్యాఖ్య ప్రచురించటం లేదు. కానీ ఎందుకు ప్రచురించవద్దన్నారో నాకు అర్థం కావట్లేదు. మీ బాధ, ఆవేదన మీరనే పెద్దవారికి తెలియాలంటే ఏదో రకంగా వారికి తెలియజేయాలి కదా? అసలు మీరెంతవరకు ఇటువంటి దాడులని ప్రతిఘటిస్తున్నారు అని కూడా తెలియాలి కదా. మీ పేరు కూడా అందులో లేదు. ఇంక మీరెందుకు ప్రచురించవద్దన్నారో నాకు అర్థం కావట్లేదు. Please do reconsider your decision.

ఒక వర్గం మీదే కాదు మన సనాతన ధర్మం మీద ఎవరు వేలెత్తి చూపినా, కువిమర్శలు చేసినా నోరెత్తి మన వాదన వినిపించటం అన్నది మీరన్నట్టు నిరంతర ప్రక్రియే. చాలా బాగా చెప్పారు మీరు. మీరన్నట్టు అందరూ కలిసి రావాలి. కానీ అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలిసేటట్టు ఉండాలి కదా? ఆరోపణలని ఖండించాలి అంటున్నారు, అందరూ ముందుకి రావాలి అంటున్నారు. నా మీద ఏదో పెద్దరికంగా, కాస్త సరదాగా చేసిన కామెంటు కూడా చెయ్యకూడదు అంటున్నారు. మరి మీరెందుకు మీ మద్దతు తెలియజేయట్లేదు. కనీసం కామెంటు కూడా ప్రచురించవద్దన్నారే, అజ్ఞాతగా అయినా. ఎందువల్ల? నాకు మీరెవరో తెలీదు. మీ వ్యాఖ్యలో మీరు ప్రస్తావించినవారు నాకు స్నేహితులు కాబట్టి మిమ్మల్ని నేనేదో అంటున్నానని కూడా దయచేసి అనుకోవద్దు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాను కాబట్టే అడుగుతున్నాను. అవతలివాళ్ళేదో చెయ్యాలి అని మీరు ఆశిస్తున్నప్పుడు మీరెందుకు చెయ్యలేకపోతున్నారు? అందరూ మద్దతు ఇవ్వాలి అన్నారు. మరి మీరెందుకు అజ్ఞాతంగానైనా మీ మద్దతు తెలిపేటట్టు ఉన్న వ్యాఖ్యని ప్రచురించ వద్దన్నారు?

Praveen Mandangi said...

మీరు ఏమనుకున్నా నేను నీహారిక గారిని యశోవంతురాలనే అనుకుంటాను. చాలా కుటుంబాలలో మగవాళ్ళ చేత సైన్స్ పుస్తకాలు చదివిస్తారు, ఆడ పిల్లల చేత పురాణాలు, ఇతిహాసాలూ చదివిస్తారు. ఇలాంటి సమాజంలో నీహారిక గారు ధైర్యం చేసి ఈ రొటీన్‌ని ప్రశ్నించడం గొప్పే కదా. సనాతన ధర్మం అనేది ఎవరి కోసం? మగవాళ్ళు ఎవరూ ఆఫీస్‌కి సెలవు పెట్టి పూజలూ, వ్రతాలూ చెయ్యరు కానీ ఆడవాళ్ళు మాత్రమే వరలక్ష్మీ వ్రతం, అట్లతద్దెల నాడు ఆఫీస్‌లకి సెలవులు పెడతారు. మతం ఆడవాళ్ళ కోసం, భౌతికవాదం మగవాళ్ళ కోసం అని రూల్ ఉంది మన దేశంలో. ఒక నాస్తికుడు తన భార్య పూజలూ, వ్రతాలూ చేస్తోందని ఆమెకి తెలియకుండా రెండో పెళ్ళి చేసుకున్నాడు అని రంగనాయకమ్మ గారు ఓ వ్యాసంలో వ్రాసారు. భార్య నాస్తికురాలైతే భర్తని వదిలేసి రెండో పెళ్ళి చేసుకుంటుందా? ఈ ప్రశ్న కూడా నీహారిక గారు అడగాల్సింది.

Malakpet Rowdy said...

Padma,

I think she sent this guy to divert the topic by posting irrelevant comments. Enjoy :)

Praveen Mandangi said...

No, Niharika didn't sent any mail to me today. పరాభవం అంటే ఏమిటో నేను నా స్త్రీ విముక్తి బ్లాగ్‌లో వ్రాసానులే.

Praveen Mandangi said...

Read the topic "గౌరవం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా?"

పద్మ said...

ఎవరేమైనా అనుకోవచ్చు కదా ప్రవీణు గారూ. మనది ప్రజాస్వామ్య దేశం మరి. ఇంతకీ మీకు యశోవంతురాలంటే అర్థం తెలుసా? ఎవర్ని పడితే వాళ్ళని ఏది పడితే అది అనే ముందు అర్థం తెలుసుకున్నారో లేదో తెలుసుకుందామని. అంతే.

పురాణాల్లోనూ,ఇతిహాసాల్లోనూ సైన్స్ లేదంటారా? ఏంటి నిజవే?

నాకు తెలిసిన చాలా కుటుంబాల్లో మగ/ఆడ భేదం లేకుండా చిన్నప్పటినించే వేదం చదువుకుంటారు, పురాణాలు, ఇతిహాసాలు, సైన్స్, సోషల్, ఎకనామిక్స్ అన్నీ చదువుతారు. జ్ఞానం ప్రధానం కానీ పుస్తకాలు బట్టీ కొడితే ఏమొస్తుంది. కనీసం భవిష్యత్తులో పుస్తకం పక్కన లేకపోతే లోకజ్ఞానం నిల్లు. ఏదన్నా అడిగితే పుస్తకం కనబళ్ళా, వెతికి దొరికినప్పుడు నా లోకజ్ఞానం ప్రదర్శిస్తానని చెప్పాల్సి వస్తుంది.

"ఇలాంటి సమాజంలో నీహారిక గారు ధైర్యం చేసి ఈ రొటీన్‌ని ప్రశ్నించడం గొప్పే కదా."

ఆవిడ రొటీన్‌ని ప్రశ్నించిందా? ఎక్కడా? మాక్కనిపించనిది ఆవిడ రాతల మధ్య మీకు కనబడిందా? ఎలా? మాకేమో ఆవిడ అర్థం పర్థం లేకుండా ఒక వర్ణాన్ని పట్టుకుని తిట్టి తర్వాత తూచ్ అని రాసినట్టు కనిపించిందే? కొంపతీసి ఆవిడ భాష వేరా? లిపి తెలుగే కానీ ప్రతిపదార్ధ తాత్పర్యాలు వేరు అయిన మరో భాషా?

"సనాతన ధర్మం అనేది ఎవరి కోసం? "

ధర్మం పాటించేవాళ్ళ కోసం. పక్కన నుంచుని తెలిసీ తెలియకుండా కుసంస్కారంతో బురద చల్లాలని ప్రయత్నించేవాళ్ళ కోసం కాదు.

"మగవాళ్ళు ఎవరూ ఆఫీస్‌కి సెలవు పెట్టి పూజలూ, వ్రతాలూ చెయ్యరు కానీ ఆడవాళ్ళు మాత్రమే వరలక్ష్మీ వ్రతం, అట్లతద్దెల నాడు ఆఫీస్‌లకి సెలవులు పెడతారు. "

సత్యన్నారాయణ వ్రతం అని ఒక వ్రతం ఉంది. చాలామంది చేసుకుంటారు. తెలుసనుకుంటాను కదా? ఆ వ్రతం ఆడవాళ్ళు ఒక్కరో లేదా మగవారొక్కరో కూచుని చేసుకోరు. అదన్నా తెలుసా? సాధారణంగా ఈ వ్రతం చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి సెలవలు పెట్టాల్సిందే లేదా కొన్ని గంటలు పర్మిషన్ తీసుకోవాల్సిందే. అంతే కానీ ఆఫీసులో కూచుని చేసేది కాదు పాపం. ఇక వ్రతం చెయ్యాలనుకున్న ఆడవాళ్ళు సెలవు పెట్టాలనుకుంటే పెడతారు. కుదరదనుకునే వాళ్ళు మానతారు. అదొక అడగాల్సిన ప్రశ్నేనా? సెలవ పెట్టకూడదు కుదరదు అనుకుంటే ఆ ఆడవాళ్ళూ, వాళ్ళ బాసులూ కదా చూసుకోవాలి. ఆ ఒక్కరోజు ఆఫీసు హైరానా లేకుండా ఇంటి పట్టున ఉండచ్చు అనుకునేవాళ్ళని కూడా ఠాఠ్ కుదరదంతే అనటం ఏం స్త్రీవాదం ప్రవీణూ? ఇంకో విషయం తెలుసా? ఏ పూజ అయినా వ్రతం అయినా యజ్ఞం అయినా యాగం అయినా మగవాడికి పక్కన భార్య లేకుండా చేసుకునే అర్హత లేదు. ఇది కదూ అసలు సిసలు స్త్రీ వాదం అంటే. కదూ? :))))))))))))))))))))))

"మతం ఆడవాళ్ళ కోసం, భౌతికవాదం మగవాళ్ళ కోసం అని రూల్ ఉంది మన దేశంలో. "

ఎక్కడా? ఏ గవర్నమెంటు ఆధ్వర్యంలో వచ్చిందా రూలు? మీ అంత పుస్తక పరిజ్ఞానం నాకు లేదు కానీ కాస్త పుస్తకం పేరు, పేజీ నంబరు చెప్పండి. ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ రూల్ చదివి మననం చేసుకుంటాను.

"ఒక నాస్తికుడు తన భార్య పూజలూ, వ్రతాలూ చేస్తోందని ఆమెకి తెలియకుండా రెండో పెళ్ళి చేసుకున్నాడు అని రంగనాయకమ్మ గారు ఓ వ్యాసంలో వ్రాసారు. "

ఎంత వెధవన్నర వెధవైతే అలా చేస్తాడు? పిరికి వెధవ కదూ? ఏంటో ఈ నాస్తికులంతా ఇలా పిరికి పందలెందుకవుతారు?

"భార్య నాస్తికురాలైతే భర్తని వదిలేసి రెండో పెళ్ళి చేసుకుంటుందా? ఈ ప్రశ్న కూడా నీహారిక గారు అడగాల్సింది."

ఆవిడడిగినా నేను చెప్పలేను ప్రవీణు గారూ. ఎందుకంటే నేను నాస్తికురాలినీ కాదూ, భర్తని వదిలేసి రెండోపెళ్ళి చేసుకునే చండాలపుగొట్టు ఆలోచనలు నాకు రావు, మొగుడిని తీసుకెళ్ళి బజార్లో కూచోపెట్టే ' యశొవంతురాలినీ ' కాను. కాబట్టి ఆవిడ అడిగినా నా దగ్గర సమాధానం లేదు, అన్‌ఫార్చ్యునేట్లీ. :(
అసలా ప్రశ్న ఆవిడ అడగటం ఏంటి? ఆవిడనే మీరడగాలి కానీ. ఆవిడే నాస్తికురాలైతే భర్తని వదిలేసి వేరే పెళ్ళి చేసుకుంటుందా. అడిగెయ్యండి. అసలే ఆవిడ వాళ్ళాయన ధ్యానం నేర్చుకుంటున్నారనీ, క్షత్రియ ధర్మం కాకుండా బ్రాహ్మణధర్మం పాటిస్తున్నారనీ వాపోయింది కదా పాపం.

అయినా తెలీకడుగుతున్నాను, ఈ నాస్తికులతో నాకు సావాసం ఎక్కువలేదులెండి అందుకే తెలీక అడగటం, నాస్తికుల్లో రూల్ ఉందా? మొగుడు పెళ్ళాన్నీ, పెళ్ళాం మొగుడినీ వదిలేసి రెండొ పెళ్ళి ఖచ్చితముగా చేసుకొనవలెను అనీ?

అద్సరే కానీ ప్రవీణు గారు, నీహరిక గారెక్కడ? అక్కడా అక్కడా తిరుగుతున్నారు కానీ ఇటువైపు వచ్చి కాస్త నా ప్రశ్నలకి సమాధానం చెప్తారేమో అనుకుంటే చెప్పరే? పోనీ ఆవిడ రానక్కరలేదు. ఆవిడ సమాధానాలు మీరు కనుక్కుని చెప్పినా సరే. పోనీ ఆవిడ రమణగారి బ్లాగ్‌లో కామెంట్స్ ఎందుకు తీసేసిందో కనుక్కుని చెప్పినా సరే.

Malakpet Rowdy said...

No, Niharika didn't sent any mail to me today.
______________________________________________

LOLZ, so she does it frequently then :))

Malakpet Rowdy said...

Just read your response Padma ..

and am laughing like hell :))

Anonymous said...

అరే ప్రవీంకి ఎదురు చెప్తార్. అరే ప్రవీన్ భాయ్ రెండువెల సమత్సరం ఎనకాల చైనాలో ఏమైందంటే అని కహాని షురు చేయ్. నీవు సిమ్మాచలం ఎక్స్‌ప్రెస్ టాయిలెట్లో పరిచయమైన పైడితల్లితో నీ ఇంటర్వ్యూ వినిపించ్. లేదా నీ మైదా నం ఎత్తి చదువు. వర్గశత్రువుల్ని నీ పాగల్ కామెంట్లతో ఖతం చెయ్.

Praveen Mandangi said...

When did Niharika mail to me? Read this screenshot http://teluguwebmedia.in/images/scs.png
When Padma replied to Niharika about defeat, I remembered that person who will be ready to lick the feet of other can gain some pennies. He may try to escape with some pennies but he won't wish to die. But this logic doesn't apply to me who always disagrees with social norms.

Praveen Mandangi said...

గూగుల్ ప్లస్‌లో కూడా ఇదే పోకడ ఉంది. ముస్లింలు అంగీకరించని సైతాన్ ప్రవచనాలు గురించి వ్రాస్తే ప్రశంశలు, బ్రాహ్మణుల గురించి వ్రాస్తే విమర్శలు. ఎలైట్ గ్రూప్ గురించి ఉదహరించేటప్పుడు బ్రాహ్మణ అని వ్రాసినా విమర్శలు వస్తున్నాయి. అయినా నాకు తెలిసి నీహారిక గారు కూడా బ్రాహ్మణురాలే కదా. గోదావరి జిల్లాలలో ఆకుల అని ఇంటి పేరు ఉన్నవాళ్ళందరూ బ్రాహ్మణులే. ఇక్కడ నీహారిక గారు బ్రహ్మ ద్వేషి అనుకోవడానికి ఏముంది?

Slap across the face said...

బ్రహ్మాండం పద్మ గారూ

ఈ ప్రవీణ్ కి చెప్పుతో కొట్టినట్టు జవాబిచ్చారు. పాపం మొహం ఎక్కడపెట్టుకోవాలో తెలియక ఏవేవో రాస్తున్నాడు.

Anonymous said...

మెంటల్ మార్తాండా. ఆకుల అనేది కాపు ఇంటిపేరు

SHANKAR.S said...

ఇగో ప్రవీణూ ఇక్కడున్నావా. అక్కడ కలల ప్రపంచం బ్లాగులో ఏదో పుస్తకం ఉందీ,నేను ఊరెళ్ళాక చూస్తాను అదీ ఇదీ అన్నావ్. నేనేమో రోజూ అక్కడికెళ్ళి నువ్వు రాక, నీ కామెంట్ లేక అసలు క్షేమంగా ఊరు చేరావో లేదో అని తెగ బెంగెట్టేసుకున్నా తెలుసా. వీళ్ళేదో వాళ్ళ మానాన వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇవన్నీ మనకెందుకు చెప్పు? పద పద అక్కడకెళ్ళి మాట్లాడుకుందాం.

(పద్మ గారూ టపాకు సంబంధం లేని కామెంట్ పెట్టినందుకు క్షమించాలి ఈ ప్రవీణ్ ఇక్కడున్నాడని తెలిసి పరిగెత్తుకొచ్చా అంతే.)

పద్మ said...

"When Padma replied to Niharika about defeat, I remembered that person who will be ready to lick the feet of other can gain some pennies. He may try to escape with some pennies but he won't wish to die. But this logic doesn't apply to me who always disagrees with social norms."

ఏంటో ఒక్క ముక్క అర్థం కాలేదు ప్రవీణు. But please don't try to explain it again. :O It's okay.

All I am looking for is response from Neeharika. I don't really care what your opinion is about the above said "logic" which ain't a logic at all in the first place. So, if you could, go request Neehaarika gaaru to answer my questions.

Anonymous said...

పద్మగారూ
నిజమే. వీడికి భలే రిటార్ట్ ఇచ్చారుగా. దెబ్బకి నోరు మూసుకున్నాడు.

Slap across the face said...

పద్మ గారూ
మీరు కొట్టిన దెబ్బకి ప్రవీణ్ మెదడు బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగింది. అందుకే ఇలాంటి సంబంధం లేని కామెంట్లు. అందులో లాజిక్ వెతకద్దు. ఇక చూడండి ఆ విషం తప్ప మిగతా అన్ని విషయాల గురించీ మాట్లడతాడు.

పద్మ said...

ఆవిడ బ్రహ్మద్వేషి అని మేమెవరమూ అనుకోలేదు ప్రవీణూ. ఆవిడే బ్రాహ్మణుల మీద పగ ప్రతీకారం క్షత్రియ ధర్మం అంటూ రాసింది. బాగ్రౌండ్ తెలీకుండా యశోవంతురాలని బిరుదులిచ్చేసి వెనకేసుకు రావటం తప్పు గదూ.

ఆవిడ మేమ్ క్షత్రియులమో అంటుంటే మీరు అడ్డగోలుగా మీరు బ్రాహ్మలంతే అని తలకి కులం చుట్టేస్తే ఎలా ప్రవీణూ?

పద్మ said...
This comment has been removed by the author.
పద్మ said...

శంకర్ గారూ, ఏం పర్లేదు. మీక్కావాల్సిన ప్రవీణు అక్కడ నించి తప్పించుకుని ఇక్కడ తిరుగుతున్నాడు. నేను వెతుకుతున్న నీహారిక గారు ఇక్కడ తప్పించుకుని అక్కడ తిరుగుతున్నారు. ఏంటో వీళ్ళ దోబూచులాట. :))))

Bhardwaj Velamakanni said...

LOOOL Padma,

You are on a roll today! Good going :)

Disp Name said...

ఈ రెండు వేల పదకొండు లో రెండో స్టార్ టపా ఇది.

ఈ ప్రవీణుడు ఎవరండీ బాబు
ఈ నీహారిక ఎవరండీ బాబు
ఈ యువర్ గాడ్ ఎవరండీ బాబు

మొత్తం మీద తల చుడుతోంది.

చీర్స్
జిలేబి.

Anonymous said...

ఎవరినైతే ద్వేషిస్తా అందో అదేకులం ఆమెది అని ప్రచారం చేసి నిగారిని ఆట పట్టిస్తున్నాడు పరవీణ్. అంటేకదూ చిలిపి పెర్విన్

Anonymous said...

ఆకుల పోకుల ఇవ్వొద్దూ
నా మూతి ఎర్రగ చేయొద్దూ
దురదలు నాలో రేపొద్దూ
నా ముసలి వయసుకు అల్లరి నేర్పొద్దు పె ర్వీనూ ఓ పె ర్వీనూ

Praveen Mandangi said...

I know why Niharika didn't reply. She has no time to waste for mules and hinnies like you. Kanchara gadidalaloa baruvulu moyyani kanchara gadidalu untayile.

పద్మ said...

ఎవరో తలకు మాసినవాడు గుఱ్ఱం ఫొటో చూసి నిన్ను గుర్తుపట్టినంత మాత్రాన, నువ్వు చూసుకునే అద్దంలోనే ప్రపంచాన్నంతా చూసి అందరూ మ్యూల్స్, హినీస్ అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తే ఎలా ప్రవీణు?

ఇంతకీ ఆ బరువు మోయని కంచెర గాడిద ఆవిడనా నీ ఉద్దేశం? తప్పు గదూ.

Praveen Mandangi said...

I am neither a mule nor hinny but a pure breed Arabian horse. You may look at the world with shaded eyes but we won't.

Anonymous said...

may be she has no time to reply you, but don't get disappointed and call yourself as mule. keep on mailing her TILL YOU GET REPLY.

SHANKAR.S said...

"I am neither a mule nor hinny but a pure breed Arabian horse."

వార్నీ ప్రవీణూ నువ్వింకా మడిసనుకుంటున్నా ఇన్నాళ్ళూ

పద్మ said...

A horse? That is what I said, right? you are not a human. you agreed. we agree. Good that we agree upon one point.

"You may look at the world with shaded eyes but we won't."
Exactly, we look at the world. but you don't. You look into the mirror and live in a presumption that the world is so much looking like you.

KumarN said...

వామ్మో పద్మా గారు, ఫుల్లు బాటింగ్ మూడ్ లో ఉన్నారు కదా. అన్నీ అవుట్ ఆఫ్ ద పార్క్ హోమ్ రన్సే.. చప్పట్లు.

ఏమిటో నేను ఆంగ్లం రేపిడెక్స్ కోర్సు కి వెళ్ళాల్సి వచ్చేలా ఉంది, అర్ధం కాక రెండు సార్లు చదవాల్సి వస్తొంది కొన్ని కామెంట్స్, ఇక్కడా, అక్కడ నాన్న బ్లాగులో. ఖర్మ

పద్మ said...

అజ్ఞాత గారూ,

మీ ఈ వ్యాఖ్యలు కూడా నాకు నచ్చాయి. ఇంత బాగా రాస్తూ మీరు అజ్ఞాతగానైనా ఎందుకు ప్రచురించవద్దంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు ఇలా వ్యక్తిగతంగా వినిపించేకన్నా బ్లాగ్ముఖంగా ప్రచురిస్తేనే వాటికి విలువ అని నేను నమ్ముతున్నాను. My request, again, is to reconsider your decision. మీరన్నట్టు జనాలు ముందుకి రావాలి, బ్లాగ్స్ రావాలి, వాళ్ళ వాదనా వినిపించాలి. ఎక్కువ పోస్ట్స్ రావాలి. అలానే వ్యాఖ్యలు ప్రచురించబడాలి. ధైర్యం లేదు అని ఆవిడ అంత దూకుడుగా అనేసింది కదా. ధైర్యమే కాదు అంగబలం కూడా చాలా ఉంది అని తెలియజెప్పాలి కదండి. Please think about it. Thanks again for the support.

పద్మ said...

భారారా గారూ, జోకులకేం తక్కువలేరండి మీరసలు. :)))))))
రౌడీ గారూ, Yes, you missed it. ;) :P
@Slap across the face మీ ఐడీ భలే ఉందండి. Thanks for the comments.
అజ్ఞాతలూ, థాంక్స్. :)
@జిలేబి గారూ. Thanks for the comment and compliment. అంత స్టార్ టపా ఘనత కన్నా నీహారిక గారి సమాధానాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందండి. :))))))))
కుమార్జీ. :))))) థాంక్స్.
నేను వీరి ఆంగ్ల కామెంట్స్ చదవటం మానేశాను. ఆ వచ్చిన కాస్త ఆంగ్లము ఎగిరిపోతే కష్టం కదూ. అందుకే. :))))))))))))))))))

Maitri said...

Atta girl! Way to go. You really do seem to be on a roll.

Anonymous said...

**భగవంతుడు వీళ్ళకి దైర్యం ఇవ్వలేదు కానీ తెలివితేటలు మాత్రం ఇచ్చాడు .*

నీహారిక గారు,
మీ దృష్ట్టిలో ధైర్యం అంటే ఎమీటి? దానిని ఎలా నిర్వచిస్తారు? ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.మీరేలగూ ఇచ్చేటట్లు లేరు,కనుక నా వాదన చదవండి. మీలాగే ఒకప్పుడు పల్లేటూరిలో వ్యవాసాయం చేసేవారు, కొంతమంది బ్రాహ్మణులకి సేద్యం చేయటం రాదు అని పుకార్లు సృట్ట్స్తూ, గాలి మాటలను చెపుకొంట్టూ ఉండేవారు. వాస్తవమేమిటంటె అసలికి వ్యవసాయం చేయటమేమి కష్ట్టం కాదు, దానిని అర్థం చేసుకోలేని బ్రహ్మవిద్య అంత కన్నా కాదు.ఈ గాలి కబుర్ల వెనకాల అసలు సంగతి, ఆరోజులో పుట్టిన ఊరిలో జీవిస్తూ,మహా ఐతే జీవిత కాలం లో తిరుపతి రెండు మూడు పున్యక్షేత్రాలు తిరిగేవారు. వీరిలో చాలా మంది బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా బావిలో కప్పల లాగా జీవించేవారు. కాని చదువుకొన్న బ్రహ్మణులు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ, కొత్త కొత్త విషయాలు తెలుసుకొంట్టూ, మానసికంగా పరిణతి చెందుతూ, తమ లోపాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించేవారు. అందులో భాగం గా వారు, వారి స్వంత ఊరిలో పెద్దగా చదువుకొని వారు, సేద్యం మీద మాత్రమే ఆధారపడి జీవించేవారు ఇలాంటి వ్యాఖ్యలు, గాసిప్ ప్రచారాలు చేస్తున్నా వాటిని పెద్ద మనసుతో పట్టించుకోలేదు. ఎందుకంటె గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో, పెద్దగా చదువుకొని వారి ప్రవర్తన అంతకన్నా మెరుగు గా ఉండాలను కోవటం అత్యాశ కదా! వారు తమ పోలాలను కొంతమందికి కవులకి ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత, పలు కారణాల వలన అమ్ముకొన్నారు. వీరు పొలాలు అమ్ముకోవటం అనేది వారు సేద్యం చేయలేక అమ్ముకొన్నారని, తమ విశ్లేషణ 100% సరి అయినదని అనుకొన్నారు. అలా వీశ్లేషణలు చేసినవారే,కొంత కాలానికి, తమ పిల్లలకు చదువు చెప్పించి, ఉద్యోగం కొరకు ప్రయత్నించటం మొదలుపెట్టారు. మీ వాదన కూడా అలా పల్లేటూరి రైతుల వాదనల లోపభూయిష్ట్టంగా వుంది.

మీరు చరిత్రను సరిగ్గా చదవినట్లు లేదు. ఒకసారి పాత చరిత్ర పుస్తకాలను తిరగ వేస్తే బ్రాహ్మణుల ధైర్య సాహసాలు తెలుస్తాయి. కనీసం స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న వారి గురించి తెలిసినా ఈ మాట మీరనుండేవారు కాదు. మీకా చరిత్ర తెలియదు కనుక ఈ మధ్య జరిగిన సంఘటనల గురించి చెపుతాను, తెలుసుకోండి. చూడబోతే మీ దృష్ట్టిలో ధైర్యం అంటే మనుషులను తన్నటం, తిట్టటం, దబాయించటం,స్కాములు చేయటం, వెన్నుపోటు పొడవటం మొదలైనవి కాబోలు.

Sri

To be continued ...

Anonymous said...

మా దృష్ట్టిలో ధైర్యం అంటే పైన చెప్పిన లక్షణాలు కావు. ఇటువంటి గుణాలు ప్రదర్శించటానికి మీరనుకొన్నంత పెద్ద ధైర్యం అవసరం లేదు. ఎవరైనా అతి సులభంగా ప్రదర్శించగలిగిన లక్షణాలు.
మా దృష్ట్టిలో ధైర్యం అంటే వేరె అర్థం ఉంది. బ్రహ్మణులు వచ్చిన అధికారాన్ని,పదవిని కర్తవ్యంగా భావించి,దానిని నిర్వహిస్తారు. మిగతావారి లాగా ఆ పదవులను చూసి తమను తాము గొప్పవారుగా భావించుకొని, పదవి పోతే ప్రాణం పోగొట్టుకోరు. మీకు తెలిసే వుంట్టుంది పి వి గారు ప్రధానిగా పదవి చేప్పటి, అది ఫోయిన తరువాత, ఆయన సహాయం చేసిన వారందరు ఆయనని పట్టించుకోకపోయినా దానికి ఆయన కుంగి, కృశించి,నశించి పోలేదు. అటువంటి విపత్కర పరిస్థితిలో తన కేసులను కోర్ట్టులో వాదించుకొని గెలిచాడు. అది మా దృష్ట్టిలొ ధైర్యం అంటే. స్థిత ప్రజ్ణ అంతే. అదె ఒక మాజి ముఖ్యమంత్రిగారు పదవి కోల్పోయిన తరువాత, ఆ సంఘటనను అవమానం గా భావించటం, అది తట్టుకోలేక ప్రాణంవదలారు. కారణం పదవిని రోల్ ప్లే గా ఆయన భావించక పోవటం. వ్యక్తిగతం గా తీసుకోవటం.
ఆ మధ్య పి. వేణు గోపాల్ ను తొలగించటానికి అంబుమణి రామదాస్ గారు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అందరికి తెలిసిన విషయమే. ఆయన భారత దేశంలో మొదటి హార్ట్ ట్రన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయటమే కాక, ఎన్నో వేల మంది కి గుండే ఆపరేషన్ లు చేసిన అతని మీద పిచ్చి ఆరోపణలతో పిచ్చెతించినా అందరిని ఒక్క చేత్తో ఎదురుకొని పోరాడారు. గేలిచాడు. పదవిని నిర్వహించటమే కాక దానికి వన్నేతీసుకు రావటం అంటే.
ఇలా రాసుకొంట్టు పోతే ఎంతో మంది వస్తారు. గ్రేహౌండ్స్ ను డిజైన్ చేసిన కె. వ్యాస్ ఐ.పి.యస్., బాల గోపాల్ ఇలా ఎంతో మంది వంటరి పోరాటాం చేసి వారు పని చేసిన రంగాలలో స్టాండర్డ్స్ నెలకొల్పారు. గత 30సం|| అధికారం చేపట్టిన వారు, గ్లోబలైసేషన్ ముసుగులో స్వంత ఆస్థులు సంపాదించుకొంట్టూ ఎటువంటి స్టాండర్డ్స్ నెలకొల్పారో, వాటిని ఎలా దిగజారుస్తున్నారో పేపర్ తెరిస్తే అందరికి తెలుసు. అధికారం, వ్యాపారం జరిగినన్ని రోజులు మేము సాధించిన అభివృద్ది అని ప్రగల్బాలు పలికేది. తప్పులు బయటపడటం రాజకీయ నాయకులంతే, వ్యాపారస్తులకు కులమేమి అనేవాదన మొదలు పెట్టేది. బ్రహ్మణ పిలాసఫి గాని, పాలకులుగాని కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చి, దానిని పరిరక్షించే విధంగా పాలన కొనసాగిచటానికి ప్రయత్నించేవారు. గత 30సం|| నుంచి గ్లోబలైసేషన్ ముసుగులో, ఆరేండు వర్గాల వారు పోటిలు పడి,అధికారం దుర్వినియోగ పరుస్తూ తమ ఆస్థులను సంపాదించుకోవటం ఫోకస్ చేసే కొద్ది కుటుంబ వ్యవస్థ కుప్ప కూలటం మొదలైంది. వీరు ఈ రోజులలో అవసరం ఉన్నాలేక పోయినా చిన్న, పెద్ద, ఆడ, మగ ప్రతి ఒక్కరికి మెదడులోకి డబ్బు పిచ్చిని బాగా ఎక్కించారు. దీనికి ప్రధాన కారణం మీడీయా,రాజకీయ లను తమ గుప్పిట ఉంచుకోవటమే.
120 కోట్ల జనాభాగల దేశంలో, ఇలా పట్ట పగలు ఒకరు వేల కోట్లు, ఇంకొకరు లక్షల కోట్లలో ప్రజాధనం బరితెగించి అప్పనం గా దోచుకొనే ఆశ, ధైర్యం బ్రాహ్మణులకైతే లేవు. దేశంలో అవినితి రూపుమాపాల, ప్రజలను చైతన్యం పరచాలా, వారికి సత్తా రావాల అంట్టు నీతులు బోధించటం కూడా మాకు తెలియదు. సామాన్య ప్రజల దగ్గర గుర్తింపు వచ్చినా, రాకున్నా,మీడీయాలో పేరు ప్రఖ్యాతులకొరకు పాకులాడకుండా, వంటరిగా పోరాటానికి సిద్దమైన సుబ్రమణ్య స్వామి, అరుణ్ శౌరి లాంటి బ్రాహ్మణులు మాకు ఆదర్శం. నాదృష్ట్టిలో వాళ్ళది ధైర్యం అంటే. మీరు అనుకొనే ధైర్యవంతులు ఈ దేశ గల్లి, గల్లి లోను స్థలాలు,పొలాలు ఆక్రమించు కొంట్టు, రౌడి ముకలను వేసుకొని పంచాయితిలు పెట్టుకొంట్టు చాలామంది దొరుకుతారు. అటువంటి ధైర్యవంతులవలన ప్రజలకి భారమే గాని లాభమేమి ఉండదు.

Sri

Anonymous said...

అసలు-సిసలు-పెసలు ఆంధ్రామ్మాయికి,
ఏడాదంతా సుఖసంతోషాలతో ఆనందంగా గడవాలని, కొత్త ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

శంకర్ (గారు అనవా? ప్లీజ్ :(( )

:))

Anonymous said...

well said Sri

పద్మ said...

చాలా బోల్డు ధన్యవాదాలు శంకూ. {గారూ ఏంటో తన్నుకున్నా రావట్లేదు శంకూ. :((((( బోల్డు ప్రయత్నించా అప్పటికీ. :( }
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. :) ఈ ఏడాది కూడా మీరు నన్ను అమ్మీ అనిన్నూ, నేను మిమ్మల్ని శంకూ అని మాత్రమే పిలవాలనిన్నూ, గార్లూ, జీళ్ళూ ఆరోగ్యానికి అంత మంచివి కావనిన్నూ. అవి కొంతమందికే మాత్రమే కొసరి కొసరి వడ్డించాలనిన్నూ కోరుకుంటున్నాను. :))

Anonymous said...

"ఆరేండు వర్గాల వారు పోటిలు పడి,అధికారం దుర్వినియోగ పరుస్తూ తమ ఆస్థులను సంపాదించుకోవటం."

బాగా చెప్పారు. మరిన్ని విషయాలు తెలియటానికి ఈ క్రింది చర్చను చదవండి.

బాబు మరో రాజశేఖరుడా?

Revant…@అధికారంలో ఉన్నపుడు ఒక్కకోక్కరు కలసి వేరు వేరు రూపాలలో, వాటాలు వేసుకొని డబ్బులను దోచి పారేశారు. అప్పటికే మీచేత మార్గం వేయబడింది, కనుక ఆ తరువాత వచ్చిన దేవుడు గారు భారి ఎత్తున ఒక్కరే చేశారు. అంతే తేడ….

మూడు ముక్కల్లో తేల్చేసారు…చక్కటి అనాలసిస్….

http://kvsv.wordpress.com/2011/11/15/%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%be/

Anonymous said...

శ్రీ గారు,
Dr. P. వేణుగోపాల్ (AIIMS)అంటే గుర్తుకు వచ్చింది. ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో కలిగి ఉన్న మరొక డాక్టర్ హైదరాబద్ లోని నిజాం ఇంస్టిటుట్ ను (NIMS)నిర్వహిస్తూన్న సమయంలో ,అక్కడ అడ్మిట్ అయిన ఒక ప్రముఖ నటుడు మానసిక ఆరోగ్యం సరిగా లేక కాల్పులు జరిపాడని చెప్పారు. ఆతరువాత అతనిని ప్రశ్రీ గారు, వేణుగోపాల్ అంటే గుర్తుకు వచ్చింది. ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో కలిగి ఉన్న మరొక డాక్టర్ హైదరాబద్ లోని నిజాం ఇంస్టిటుట్ ను నిర్వహిస్తూన్న సమయంలో ,అక్కడ అడ్మిట్ అయిన ఒక ప్రముఖ నటుడు మానసిక ఆరోగ్యం సరిగా లేక కాల్పులు జరిపాడని చెప్పారు. ఆతరువాత అతనిని ప్రభుత్వం రిజైన్ చేయమంటే, మారు మాట్లాడకుండా పదవి నుంచి తప్పుకొన్నారు. అంత పెద్ద డాక్టర్ అయి ఉండి, అంతర్జాతీయం గా పేరు ప్రఖ్యాతులు ఉండి, కనీస స్థాయిలో వారు ప్రొటేస్ట్ కూడా చేయలేదు. ఆయన మంచి వారై ఉండవచ్చు కాని నిష్పక్ష పాతంగా వ్యవహరించి ఉండి వుంటే ప్రభుత్వానికి ఆయనని తొలగించే ధైర్యం ఉండి వుండేదా?