Thursday, September 6, 2007

మాయాబజార్ ..... కంటిన్యూడ్

నాకు ఇష్టమైన సన్నివేశాలు, డైలాగులు .....

ఎస్వీ రంగారావు : హే లంబు హే జంబు మ్రోగించండి రణభేరి .....

రుష్యేంద్రమణి : అయ్యయ్యో అబ్బాయి విన్నట్టున్నాడే .....

సూర్యకాంతం : ఆ సుపుత్రా సుపుత్రా సుపుత్రా .....

ఎస్వీ రంగారావు : సహచరులరా మీరిక సకలాయుధాలతో సర్వసైన్యాలతో సిధ్ధపడండి మనమిప్పుడు యుధ్ధయాత్రకు వెళ్తున్నాం

అనుచరులు : హై హై నాయకా ..... వై వై నాయకా
హై హై నాయకా ..... వై వై నాయకా

నాగేశ్వరరావు : సోదరా ఎవరితో యుధ్ధానికి ..... నేనూ వస్తాను

ఎస్వీ రంగారావు : నేనుండగా నీవెందుకు సోదరా ..... సహచరులారా .....

సూర్యకాంతం : సుపుత్రా ఓ సుపుత్రా సుపుత్రా .....

ఎస్వీ రంగారావు : విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాటను తప్పుటయే కాక తుఛ్ఛ కౌరవుల పొత్తు కలుపుకుని జగజ్జగిత పరాక్రములైన మా తండ్రులనే తూలనాడిరిగా యాదవులు
ఎంత మదమెంతకావరమెంత పొగరు
అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టకట్టి నేల మట్టుబెట్టని ఎడల నా మహిమ ఏల

దురహంకారమదాంధులై ఖలులు విద్రోహంబు కావించిరే
అరెరె
వారికి శృంగభంగమును చేయల్లెడొకొ లోకభీకరుడీ వీర ఘటొత్కచుండు
ఇదె ప్రతిజ్ఞన్ చేసినాడన్ తృటిన్ కురువంశంబునన్ దహించెదన్ యదుకులక్షోబంబు కావించెదన్

అనుచరులు : హై హై నాయకా ..... వై వై నాయకా
హై హై నాయకా ..... వై వై నాయకా

రుష్యేంద్రమణి : నాయనా నా అన్నతో యుధ్ధానికి నీవు వెళ్తే ఒకటి అభిమన్యుడు వెళితే ఒకటినా. అది నాకు అప్రతిష్ఠ కాదు

ఎస్వీ రంగారావు : అట్లైన మాతా నేను హస్తినాపురికి పోయి కౌరవ ఘాతకులనైన హతమార్చి వచ్చెదను

సూర్యకాంతం : వారిని నీవు చంపరాదురా సుపుత్రా మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉండాలి.

No comments: